- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
కశ్మీర్ లో ప్రధాని మోడీ మెగా ర్యాలీ..!
![కశ్మీర్ లో ప్రధాని మోడీ మెగా ర్యాలీ..! కశ్మీర్ లో ప్రధాని మోడీ మెగా ర్యాలీ..!](https://www.dishadaily.com/h-upload/2024/02/27/311843-modiii.webp)
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ కశ్మీర్ లో మెగా ర్యాలీ చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే నెలలో జమ్ముకశ్మీర్ లో మోడీ పర్యటించనున్నట్లు సమాచారం. అనంత్ నాగ్ జిల్లాలో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని తెలిపాయి బీజేపీ వర్గాలు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో మోడీ పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసమే కశ్మీర్ లో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించబోతుంది.
కానీ.. ఈ ర్యాలీ ఎప్పుడు జరుగుతుందో కచ్చితమైన తేదీ తెలియాల్సి ఉంది. కాకపోతే.. మార్చి 14 నుంచి 17 మధ్య ఏరోజయినా ర్యాలీ ఉండే అవకాశం ఉంది. దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్, కుల్గాం, అనంత్నాగ్, జమ్మూలోని అనంతనాగ్-రాజౌరీ లోక్సభ స్థానంపై బీజేపీ దృష్టి సారించింది. 2019లో ఈ ఎంపీ స్థానాన్ని నేషనల్ కాన్ఫరెన్స్కి చెందిన జస్టిస్ హస్నన్ మసూది గెలుచుకున్నారు.
మరోవైపు.. గత రెండు నెలల్లో ప్రధాని మోడీ జమ్మూ కశ్మీర్లో పర్యటించడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 20న జమ్మూలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. రూ.32 వేల కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని మోడీ.