పాటియాల ఘర్షణలో ప్రధాన నిందితుడు అరెస్ట్

by Disha Web |
పాటియాల ఘర్షణలో ప్రధాన నిందితుడు అరెస్ట్
X

చండీగఢ్: పాటియాలా కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న బర్జీందర్ సింగ్ పర్వానాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం పంజాబ్ పోలీసులు అరెస్ట్ ను నిర్ధారిస్తూ ప్రకటన చేశారు. పాటియాలా ఘర్షణలో ప్రధాన నిందితుడైన బర్జీందర్ సింగ్ పర్వానా ను మొహాలీలో అరెస్ట్ చేశాం అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖ్వీందర్ సింగ్ ఛిన్నా తెలిపారు.

తదుపరి పోలీసు విచారణ కోసం పర్వానాను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పర్వానా పంజాబ్ లోని రాజ్ పూరా నివాసిగా గుర్తించారు. గతంలోనూ పలు అల్లర్లలో పాలు పంచుకొన్నట్లు చెప్పారు. శుక్రవారం పాటియాలలో చోటు చేసుకున్న ఘర్షణల వెనుకు పర్వానా హస్తం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇరువర్గాల మధ్యలో దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. ఇప్పటికే శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ హరీశ్ సింగ్లాతో పాటు దల్జీత్ సింగ్, కుల్దీప్ సింగ్ లను అరెస్ట్ చేశారు. ఈ ఘర్షణపై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా, 25 మందిని నిందితులుగా చేర్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ ఛిన్నా అన్నారు.

Next Story

Most Viewed