పార్లమెంటు దాడి కేసు.. మరో 8 రోజులు పోలీస్ కస్టడీలో నిందితులు

by Dishanational6 |
పార్లమెంటు దాడి కేసు.. మరో 8 రోజులు పోలీస్ కస్టడీలో నిందితులు
X

దిశ, నేషనల్, బ్యూరో: పార్లమెంటు దాడి కేసులో నిందితులకు పోలీస్ కస్టడీని మరో 8 రోజులకు పెంచింది. నిందితుల కస్టడీని పొడిగించినట్లు పటియాలా హౌస్ కోర్టు తెలిపింది. మరోవైపు నిందితులు లలిత్ ఝా, మహేశ్ కమావత్, అమోల్ పాలిగ్రాఫ్ టెస్టు కోసం అంగీకరించారు. సాగర్ శర్మ, మనోరంజన్ పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టు కోసం అంగీకరించారు. మరో నిందితురాలు నీలమ్ మాత్రం పాలిగ్రాఫ్ టెస్టు కోసం అంగీకారం తెలుపలేదు. గతేడాది డిసెంబరులో పార్లమెంటుపై దాడి జరిగింది. ఈ కేసులోనే నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ కస్టడీ గడువు పెంచుతూ కోర్పు తీర్పిచ్చింది.

Next Story

Most Viewed