16 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు: కేంద్రం

by Disha Web Desk 17 |
16 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు: కేంద్రం
X

న్యూఢిల్లీ: సుమారు 16 లక్షల మందికి పైగా గత 11 ఏళ్లలో భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు కేంద్రం పేర్కొంది. ఒక్క ఈ ఏడాదే ఆ సంఖ్య 1,83,741 గా ఉన్నట్లు శుక్రవారం లోక్‌సభలో కేంద్రమంత్రి మురళీధరన్ వెల్లడించారు. అయితే 2020లో ఈ సంఖ్య 85,256గా ఉందని, అత్యధికంగా ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 1,83,741 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు.

మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాకుండా దేశంలో పౌరసత్వం నమోదు చేసుకున్న విదేశీయులు 2015లో 93, 2016 లో 153, 2017 లో 175, 2018లో 129, 2019లో 113, 2020లో 27, 2021లో 42, 2022 లో 60 మంది ఉన్నారు.


Next Story