‘రాహుల్‌ అనర్హత’పై పెద్ద మనసు చేసుకోండి

by Disha Web Desk 7 |
‘రాహుల్‌ అనర్హత’పై పెద్ద మనసు చేసుకోండి
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటు వేయడంపై రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీకి రెండేళ్ల జైలు శిక్ష చాలా ఎక్కువ అని అన్నారు. బిహార్‌లో జన్ సూరజ్ పాదయాత్ర సందర్భంగా శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను న్యాయనిపుణుడిని కాకపోయిన రాహుల్ విధించిన రెండేళ్ల శిక్ష చాలా ఎక్కువని చెప్పారు.

ఎన్నికల వేడిలో ఇలాంటివి జరగుతాయని.. ఇదే మొదటిది కాదని.. చివరిది కూడా కాబోదని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ మాటలను గుర్తుచేస్తూ రాహుల్ అనర్హత వేటుపై బీజేపీ పెద్ద మనసు చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో మరి కొన్ని రోజులు ఎదురుచూసి, ఉన్నత కోర్టులో బాధితుడి అప్పీల్‌ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందని అన్నారు.




Next Story