జనాభా నియంత్రణ అవసరం లేదు.. ఓవైసీ

by Dishafeatures2 |
Asaduddin Owaisi Asks, Why there is no Debate on Ladakh Border Crisis In Parliament
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో జనాభా నియంత్రణ ఏమాత్రం అవసరం లేదని, దేశం ఇప్పటికే భర్తీ రేటును చేరుకుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బుధవారం అన్నారు. దేశంలోని సరికొత్త జనాభా పాలసీ కావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ మన్ అన్న వ్యాఖ్యలకు సమాధానంగా ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నాగ్‌పూర్‌లో నిర్వహించని దసరా ఉత్సవాల్లో పాల్గొన్న మోహన్ భగ్వత్.. దేశంలో సమగ్ర ఆలోచనతో తయారు చేసిన జనాభా పాలసీ ఉండాలని, ఆ పాలనీ ప్రతి వర్గానికి సమానంగా వర్తించాలని అన్నారు. ఆయన మాట్లపై స్పందించిన ఓవైసీ.. జనాభా నియంత్రణ అవసరం లేదని అన్నారు.

'హిందువులు, ముస్లింలు ఒకే డీఎన్ఏ కలిగి ఉంటే వారి లెక్కల్లో అసమతుల్యత ఎక్కడ ఉంది? మనం ఇప్పటికే భర్తీ రేటును సాధించాం. కాబట్టి జనాభా నియంత్రణ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సమస్యలు వృద్ధులవుతున్న ప్రజలు, నిరుద్యోగులుగా ఉన్న యువత. సంతానోత్పత్తి రేటులో ముస్లింలు భారీ క్షీణతను కలిగి ఉన్నారు' అని ఓవైసీ అన్నారు.

అంతేకాకుండా 'ఈ రోజు మోహన్‌కు కుక్కుల ఈలలు, ద్వేషపూరిత వార్షిక దినోత్సవం. జనాభా అసమతుల్యతపై ఉన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం, జాతి నిర్మూలన, ద్వేషపూరిత నేరాలకు దారితీశాయి. అల్బేనియన్ ముస్లింలపై సెర్బియన్ ముస్లింలు చేసిన మారణహోమం తర్వాత కొసొవో స్థాపించబడింది' అని ఓవైసీ అన్నారు.



Next Story

Most Viewed