తన బిడ్డకు ‘మహాలక్ష్మి’ రైలు పేరు పెట్టిన ముస్లిం మహిళ .. కారణం ఇదే

by Prasad Jukanti |
తన బిడ్డకు ‘మహాలక్ష్మి’ రైలు పేరు పెట్టిన ముస్లిం మహిళ .. కారణం ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ముస్లిం మహిళ తనకు జన్మించిన బిడ్డకు 'మహాలక్ష్మి' అని రైలు పేరు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైన్ లోనే తన బిడ్డ పుట్టిందని ఇకపై రైలు పేరుతోనే పిలుచుకుంటానని నిర్ణయించుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విచిత్ర ఉదంతంలో అసలేం జరిగిందంటే.. కల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో జూన్ 6న ఫాతిమా ఖాతూన్ (31) తన భర్త తయ్యబ్ తో కలిసి ప్రయాణిస్తోంది. ట్రైన్ లోనావాలా స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో ఫాతిమాకు వాంతులు అవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్ కు వెళ్ళింది. ఎంత సేపటికి ఫాతిమా తిరిగి రాకపోవడంతో ఆమె భర్త వెళ్లి చూడగా ఫాతిమా అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు. దీంతో తోటి ప్రయాణికులకు విషయం చెప్పడంతో వారంతా ఫాతిమాకు సహాయం చేశారు. అనంతరం ఈ విషయాన్ని తయ్యబ్ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. రైలు లోనావాలా స్టేషన్ కు చేరుకోగానే అప్పటికే రైల్వే అధికారులు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉండటంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఫాతిమా భర్త మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రయాణించిన రైలులో తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ బిడ్డను చూసి మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ లో లక్ష్మీదేవి జన్మించిందని అన్నారని ఈ మాటలు విన్న తన భార్య తమ బిడ్డకు మహాలక్ష్మి పేరుతోనే పిలుచుకోవాలని నిర్ణయించుకుందని చెప్పాడు.



Next Story

Most Viewed