- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కూతురిని దారుణంగా హత్య చేసిన తండ్రి
సూరత్: స్థానిక సత్య నగర్ సొసైటీలోని ఓ ఫ్లాటులో రామానుజ అనే వ్యక్తి భార్య, కూతురు (19)తో కలిసి అద్దెకు ఉంటున్నాడు. వేసవి కాలం కావడంతో ఇంటి డాబాపై పడుకుందామని భార్య అడిగింది. ఈ విషయమై భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర కోపోధ్రిక్తుడైన రామానుజ రాత్రి 11.20 గంటల సమయంలో కత్తితో భార్యపై దాడికి దిగాడు. అడ్డొచ్చిన కూతురిని అత్యంత దారుణంగా 25 సార్లు పొడిచి చంపాడు. తండ్రి నుంచి తప్పించుకోవడానికి ఆమె పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లింది.
అయినా ఆ కసాయి తండ్రి వదిలిపెట్టలేదు. కూతురిని వెంబడించి మరీ హత్య చేశాడు. ఆ తర్వాత భార్యను కూడా తీవ్రంగా గాయపరిచాడు. ఇరుగుపొరుగు వాళ్లు అతన్ని బంధించేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా దాడికి దిగాడు. దీంతో ఎవరూ అతని వద్దకు వచ్చే ధైర్యం చేయలేదు. ఈ దృష్యాలు ఫ్లాట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు రామానుజను అరెస్టు చేసి అతని వద్ద నుంచి హత్యకు వినియోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.