షొపియన్‌లో ఎల్ఈటీ ఉగ్రవాది హతం

by Disha Web Desk 16 |
షొపియన్‌లో ఎల్ఈటీ ఉగ్రవాది హతం
X

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఆదివారం షొపియన్ జిల్లాలో సైన్యానికి, ముష్కరులకు జరిగిన ఎన్‌కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. చనిపోయిన ఉగ్రవాది లష్కర్ ఈ తైబా సంస్థకు చెందినట్లుగా గుర్తించారు. నౌపూరా ప్రాంతానికి చెందిన నసీర్ అహ్మద్‌గా పేర్కొన్నారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని బాస్కుచాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా, ఎదురుకాల్పుల్లో చేపట్టినట్లు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించారని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో జరిగిన పలు ఉగ్రనేరాల్లో అహ్మద్‌కు సంబంధముందని చెప్పారు.



Next Story