గారోల్ అడవుల్లో లష్కరే తోయిబా కమాండర్ హతం.. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ

by Disha Web Desk 12 |
గారోల్ అడవుల్లో లష్కరే తోయిబా కమాండర్ హతం.. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్ లోయలో గత వారం రోజులుగా ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నారు. తుపాకుల మోత శబ్దాలతో గడుపుతున్నారు. అయితే జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లా గారోల్ అడవుల్లో వారం రోజుల నుంచి జరుగుతున్న యాంటీ టెర్రర్ ఆపరేషన్ ముగిసిందని, సెర్చ్ ఆపరేషన్ మాత్రం కొనసాగుతోందని అదనపు డీజీపీ విజయ్ కుమార్ ఇవాళ పేర్కొన్నారు. సోమవారం కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్ గా గుర్తించామని ప్రకటించారు.

మరో ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరు మాత్రమే కాకుండా మరో ముగ్గురు ఉగ్రవాదులు తిరుగుతున్నారనే సమాచారం ఉందని, లోయలోని అటవీ ప్రాంతంలో వారు చిక్కుకున్నట్లు తెలుస్తోందని, వారి కదలికలపై నిఘా పెంచుతామన్నారు. లైవ్ గ్రెనేడ్లు ఉండే అవకాశం ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకూడదని సూచించారు. కాగా, ఇటీవల కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ , 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ భట్‌లను ఉగ్రవాదులు హతమార్చడంతో టెర్రరిస్ట్ సర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story