కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. భయం పుట్టిస్తున్నారంటూ..

by Dishafeatures2 |
కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. భయం పుట్టిస్తున్నారంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం దెబ్బకు దేశంలో సామాన్యుడు జీవించేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తుందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమానికి నిధుల కొరతను ఎదుర్కొంటుందని, అందుకే తమ ధనికుల స్నేహితుల కోట్ల రుణాలను మాఫీ చేసిందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలో కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. కేజ్రీవాల్ ఓ లై మాస్టర్ అని అన్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక వ్యవస్థపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో భయం పుట్టిస్తున్నారని అనురాగ్ అన్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థక మంత్రిత్వ శాఖ నిర్ణయాలను కేజ్రీవాల్ వక్రీకరిస్తున్నారని, తద్వారా ప్రజలను తనవైపు తిప్పుకే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.


Next Story

Most Viewed