వర్షకాలం కప్పలా అదృశ్యమైపోతుంది- కంగానపై విక్రమాదిత్య సింగ్ సెటైర్లు

by Dishanational6 |
వర్షకాలం కప్పలా అదృశ్యమైపోతుంది- కంగానపై విక్రమాదిత్య సింగ్ సెటైర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనాపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు.అదేస్థానం నుంచి విక్రమాదిత్య సింగ్ బరిలో ఉన్నారు. విక్రమాదిత్య సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కంగనా రనౌత్ కప్పలాంటివారని.. కొన్నిరోజుల్లోనే అదృశ్యమైపోతారని మండిపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని.. కేవలం 'పర్యటన' కోసమే రనౌత్ అక్కడికి వచ్చారని ఆరోపించారు. కంగనా రనౌత్ ఈ రోజు ఇక్కడ ఉందని.. ఆమె వర్షాకాలంలో బయటకు వచ్చే కప్పలా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కంగనా రనౌత్ వేషధారణపై సెటైర్లు వేశారు విక్రమాదిత్య. ఆమె షూటింగ్ కు వెళ్లినట్లుగా దుస్తులు ధరించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. హిమాచల్ సంప్రదాయ దుస్తులు ధరించి ప్రజల హృదయాలు గెలుచుకోలేరని అన్నారు. ఆ దుస్తులు వేసుకుంటేనే ప్రజల బాధలను అర్థం చేసుకోలేరని మండిపడ్డారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు హిమాచల్ వచ్చిందని.. మరో మూడు నెలల తర్వాత తిరిగి వెళ్తుందని చురకలు అంటించారు.

ఇకపోతే, ఏప్రిల్ 15న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను కంగనా రనౌత్ కలిశారు. ఆ తర్వాత చంబాజిల్లాలోనే భర్మూర్ ప్రాంతంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు.

Next Story

Most Viewed