కేంద్ర ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరణ

by Mahesh |
కేంద్ర ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీయే కూటమిలోని ప్రధాని మోడీ 3.0 కేబినెట్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చోటు దక్కింది. ఈ క్రమంలో ఆయన ఈ నెల 9 ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నడ్డా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు సోమవారం ఆరోగ్య శాఖ తో పాటు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖను కేటాయించారు. కాగా ఈ రోజు నడ్డా హెల్త్, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత బీజేపీ ప్రభుత్వంలో ఈ శాఖను మన్సుఖ్ మాండవీయ మంత్రిగా నిర్వహించారు. 2019లో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు మోడీ ప్రభుత్వ మొదటి టర్మ్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.

2020 జనవరిలో కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా నియామకం తర్వాత పూర్తి స్థాయి పార్టీ అధ్యక్షుడయ్యారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన 63 ఏళ్ల నడ్డా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)తో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అతను 1991లో భారతీయ జనతా యువమోర్చా (BJYM), BJP యువజన విభాగం అధ్యక్షుడయ్యాడు. బీజేపీలో పలు కీలక పదవులు నిర్వహించి, పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి నేతృత్వం వహించారు. తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు. నడ్డా 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా చేశారు.



Next Story

Most Viewed