- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Breaking: ఐపీఎల్ నిరధిక వాయిదా

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL- 2025) ను బీసీసీఐ (BCCI) నిరవధిక వాయిదా (IPL SUSPENDED) వేసింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించింది. యుద్ధ పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. తదుపరి షెడ్యూల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు. ఇండో-పాక్ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నిన్న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే రద్దయింది. టోర్నీలో భాగంగా ఇవాళ లక్నో వేదికగా లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య మాచ్ జరగాల్సి ఉండగా ఇంతరో టోర్నీ వాయిదా పండింది.
లీగ్ లో మరో 12 మ్యాచ్ లు:
ఐపీఎల్ లీగ్ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. హైదరాబాద్, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, జైపూర్, ముంబయి నగరాలు ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఫ్లై ఆఫ్స్ లో భాగంగా క్వాలిఫయర్, ఎలిమినేటర్-1 మ్యాచ్ లకు హైదరాబాద్, ఎలిమినేటర్-2, ఫైనల్ మ్యాచ్ లు కోల్ కతాలో నిర్వహించాల్సి ఉంది. ఇంతలో సెక్యూరిటీ రీజన్స్ తో టోర్నీలోని మిగతా మ్యాచ్ లను నిరవధిక వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
దుబాయ్ కి పాకిస్తాన్ సూపర్ లీగ్:
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 (Pakistan Super League) వేదిక మారింది. యుద్ధం నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే కొనసాగిస్తున్న పీఎస్ఎల్ 10 ఎడి,న్ ను యూఏఈకి మార్చింది. ఈ లీగ్ లో ఇంకా మరో 8 మ్యాచ్ లు ఉన్నాయి. ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా పీఎస్ఎల్ ను యూఏఈకి తరలిస్తున్నట్లు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ ప్రకటించాడు. ఈ లీగ్ లో వివిధ దేశాలకు చెందిన దాదాపు 40 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ప్రస్తుతం వారి భద్రతపై ఆందోలనలు నెలకొన్నాయి. యుద్ధం నేపథ్యంలో వారంతా తమ స్వదేశాలకు వెళ్లిపోదామనుకుంటున్నా అక్కడ అంతర్జాతీయ వినాశ్రయాలన్నీ మూతబడ్డాయి. దీంతో విదేశీ క్రికెటర్లు పాక్ లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.