- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
యుద్దానికి ముగింపు ఇవ్వండి.. కేంద్రమంత్రి జైశంకర్
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్దానికి ముగింపు ఇవ్వాలని నొక్కి చెప్పారు. పరిస్థితుల దృష్ట్యా సాయుధ పోరాటాన్ని ఆపాలని కోరారు. గురువారం ఆయన భద్రతా మండలి సమావేశంలో మాట్లాడారు. 'ఉక్రెయిన్ వివాదం మొత్తం అంతర్జాతీయ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇది సాగుతున్న తీరు నిజంగా కలవరపెట్టే విధంగా ఉంది. ఈ విషయంలో తక్షణమే అన్ని శత్రుత్వాలను విరమించుకొని, ప్రజాస్వామ్యపరమైన చర్చలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే ప్రధానిమోడీ ఇది యుద్ధానికి సంబంధించిన యుగం కాదని పేర్కొన్నారు' అని తెలిపారు. ఇలాంటి ఘర్షణ పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ న్యాయానికి లేదా మానవ హక్కుల ఉల్లంఘనకు సమర్థత లేదని పేర్కొన్నారు. ఇటువంటి అంశాలపై అత్యవసర దర్యాప్తు అవసరమని తెలిపారు. కాగా, గత ఐరాస సమావేశాల్లో రష్యాను వ్యతిరేకించేందుకు భారత్ నిరాసక్తిని కనబరిచిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమావేశంలో యుద్ధం ముగించాలని పేర్కొనడం సంచలనంగా మారింది.
ఉగ్రవాదంపై ఆంక్షలు నిష్పక్షపాతంగా ఉండాలి
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాద ఆందోళన నేపథ్యంలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత్ పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు.
'జవాబుదారీతనం నుండి తప్పించుకోవడానికి రాజకీయాలు అడ్డంగా ఉపయోగించడం లేదా నిజానికి శిక్షాస్మృతిని సులభతరం చేయకూడదు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఉగ్రవాదులను నిధుల మంజూరును వ్యతిరేకించే విషయంలో అలసత్వాన్ని చూశాం' అని అన్నారు. ముంబై దాడుల ప్రధాన సూత్రదారుల్లో ఒకరైనా సాజిద్ మిర్కు చెందిన లష్కర్ ఈ తోయిబా సంస్థకు నిధుల మంజూరు నిలిపివేయాలని చైనాకు భారత్, యూఎస్ ప్రతిపాదనలు చేశాయి. దీనిని చైనా తిరస్కరించడంతో తాజాగా ఎదురుదాడికి దిగింది.