బీజేపీ రూ.4,600కోట్ల ట్యాక్స్ కట్టాలి.. ఐటీ నోటీసులపై కాంగ్రెస్ రియాక్షన్..!

by Dishanational6 |
బీజేపీ రూ.4,600కోట్ల ట్యాక్స్ కట్టాలి.. ఐటీ నోటీసులపై కాంగ్రెస్ రియాక్షన్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేతలు. ఆదాయపు పన్ను చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని బీజేపీపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. కాంగ్రెస్ రూ.1,700కోట్లు పెనాల్టీ కట్టాలని లీగల్ నోటీసులు వచ్చిన సంగతి తెల్సిందే. అయితే, బీజేపీ ఉల్లంఘనలకు పాల్పడినప్పటికీ.. ఐటీ అధికారులు కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు.

ఐటీ శాఖ‌కు బీజేపీ సుమారు 4600 కోట్ల రూపాయల పెనాల్టీ క‌ట్టాల్సి ఉంద‌ని ఆరోపించారు కాంగ్రెస్ నేత అజ‌య్ మాకెన్. ఆ డబ్బును వ‌సూల్ చేసేందుకు బీజేపీకి ఆదాయపు పన్ను శాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాల‌ని పేర్కొన్నారు. మేం పాల్పడిన ఉల్లంఘ‌న‌ల‌ను స‌మీక్షించేందుకు ఎలాంటి అంచ‌నాలు చేశారో.. అలాగే బీజేపీ ఉల్లంఘ‌న‌ల‌ను తాము కూడా స్టడీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దాని ప్రకారం బీజేపీ 4600 కోట్ల రూపాయల జరిమాన క‌ట్టాల్సి ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. త‌మ‌కు ఇచ్చిన ప‌న్ను పెనాల్టీ నోటీసుపై మూడు సార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు అజయ్ మాకెన్. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ ఏప్రిల్ ఒక‌టో తేదీన ఉందని తెలియజేశారు.

మరోవైపు, బీజేపీ ట్యాక్స్ టెర్రరిజానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారుల నోటీసులు త‌మ స్పూర్తిని దెబ్బ తీయలేవని అన్నారు. ఇలాంటి దాడులకు కాంగ్రెస్ భయపడదని తెలిపారు. న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రీపెయిడ్‌, పోస్టు పెయిడ్‌, పోస్టు రెయిడ్‌, షెల్ కంపెనీ గ్రూపుల ద్వారా ఈ బాండ్ల కుంభకోణం జ‌రిగింద‌న్నారు. ట్యాక్స్ టెర్రరిజంతో కాంగ్రెస్ పై అటాక్ చేస్తున్నారని ఆరోపించారు జైరాం రమేశ్.


Next Story

Most Viewed