- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉగ్రవాదులకు స్లీపర్ సెల్గా బిహార్: గిరిరాజ్ సింగ్
by Disha Web Desk 21 |
X
పాట్నా: ఉగ్రవాదులకు స్లీపర్ సెల్గా బిహార్ మారిందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం దాడులు నిర్వహించింది. ఈ దాడులపై మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకర్తలను ప్రోత్సాహిస్తున్నారని ఆరోపించారు.
ఉగ్రవాదుల కోసం బిహార్ స్లీపర్ సెల్స్గా మారిందన్నారు. స్లీపర్ సెల్స్తో బిహార్ నిండిపోయిందన్నారు. భారత దేశాన్ని ముస్లిం దేశంగా మార్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే చట్టం తన పని తాను చేస్తోందని పేర్కొన్నారు. కాగా, బిహార్లోని పూర్నియా ప్రాంతంలో ఉన్న పీఎఫ్ఐ ప్రాంతీయ కార్యాలయంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
Next Story