రెండు రోజుల్లో గులాంనబీ ఆజాద్ పార్టీ ప్రకటన

by Disha Web Desk 21 |
రెండు రోజుల్లో గులాంనబీ ఆజాద్ పార్టీ ప్రకటన
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మరో రెండు రోజుల్లో నూతన పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఆదివారం ఆజాద్ వెల్లడించారు. పార్టీ ఆవిష్కరణకు ముందు మీడియాతో సమావేశం కానున్నట్లు సన్నిహితులు చెప్పారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన గుర్తు, జెండా ఖరారైనట్లు పేర్కొన్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో పార్టీని కశ్మీర్‌లో అవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.

73 ఏళ్ల ఆజాద్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆజాద్‌కు మద్దతుగా జమ్ములో అనేక మంది కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ రాష్ట్రహోదాను తిరిగి తీసుకురావడమే తన పార్టీ అజెండా అని పేర్కొన్నారు.


Next Story

Most Viewed