కేరళ: రైలు కోచ్‌లో మంటలు.. పూర్తిగా కాలిపోయిన భోగి

by Disha Web Desk 12 |
కేరళ: రైలు కోచ్‌లో మంటలు.. పూర్తిగా కాలిపోయిన భోగి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగి ఉన్న రైలు కోచ్‌లో అగ్నిప్రమాదం జరిగి ఓ బోగి పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన కేరళలోని కన్నూర్‌లో అలప్పుజా-కన్పూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలో అగ్నిప్రమాదానికి కారణమేమిటో బయటపడతాయని తెలిపారు. అయితే గతంలో.. ఏప్రిల్‌లో అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక వ్యక్తి తన సహ ప్రయాణీకులను తగులబెట్టడం తో ముగ్గురు వ్యక్తులు మరణించారు.


Next Story