- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళ: రైలు కోచ్లో మంటలు.. పూర్తిగా కాలిపోయిన భోగి
ఆగి ఉన్న రైలు కోచ్లో అగ్నిప్రమాదం జరిగి ఓ బోగి పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన కేరళలోని కన్నూర్లో అలప్పుజా-కన్పూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్లో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్డెస్క్: ఆగి ఉన్న రైలు కోచ్లో అగ్నిప్రమాదం జరిగి ఓ బోగి పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన కేరళలోని కన్నూర్లో అలప్పుజా-కన్పూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్లో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ పరీక్షలో అగ్నిప్రమాదానికి కారణమేమిటో బయటపడతాయని తెలిపారు. అయితే గతంలో.. ఏప్రిల్లో అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్లో ఒక వ్యక్తి తన సహ ప్రయాణీకులను తగులబెట్టడం తో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Next Story






