- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'నా కొడుకు నిర్దోషి'.. నిందితుడి తండ్రి కీలక వ్యాఖ్యలు
డెహ్రాడూన్: రిసెప్షనిస్ట్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుల్కిత్ ఆర్య అమాయకుడని నిందితుడి తండ్రి వినోద్ ఆర్య తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో వినోద్ ఆర్య మాట్లాడుతూ.. 'పుల్కిత్ ఆర్య ఒక సాదాసీదా అబ్బాయి. చాలా కాలంగా తమతో దూరంగా ఉంటున్నాడు. తన పనేదో తాను చూసుకుంటాడు. పుల్కిత్ ఆర్యతోపాటు హత్యకు గురైన యువతికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. పుల్కిత్ ఇలాంటి పనుల్లో ఎప్పుడూ పాల్గొనలేదు.. తను ఒక నిర్దోషి. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. అందుకే నాతోపాటు నా కొడుకు కూడా బీజేపీ పదవులకు రాజీనామా చేశాము.' అని తెలిపారు.
2016లో పుల్కిత్పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారన్న ఆరోపణలను ఖండించారు. కాగా, ఉత్తరాఖండ్ రిషికేష్లోని వంతారా రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా పని చేసే 19 ఏళ్ల యువతి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రిసార్ట్ ఓనర్ పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఓ కస్టమర్కు 'ప్రత్యేక సేవలు' అందించాలని యువతిపై ఒత్తిడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.