దేశద్రోహి అనడం బాధించింది: సచిన్ ఫైలట్

by Disha Web Desk 17 |
దేశద్రోహి అనడం బాధించింది: సచిన్ ఫైలట్
X

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనను దేశద్రోహిగా పేర్కొనడంపై సచిన్ ఫైలట్ స్పందించారు. ఎంత రాజకీయ నాయకుడిని అయినంత మాత్రాన తాను కూడా మనిషినేనని, ఆ వ్యాఖ్యలు తనను బాధించాయని మీడియాకు ఫైలట్ చెప్పారు. అయితే దీనిపై వెనక్కి వెళ్లాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజా జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిందేనని అన్నారు. నాయకత్వం విషయంలో తన స్థాయి ఏంటో పార్టీకి తెలుసునని, అందరం కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పారు. గత నెలలో గెహ్లాట్ ఓ ఇంటర్వ్యూలో సచిన్ ఫైలట్‌నుద్దేశించి మాట్లాడుతూ.. దేశద్రోహి ఎప్పుడూ కూడా సీఎం కాలేరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గెహ్లాట్, ఫైలట్ పార్టీ ఆస్తులని పేర్కొనడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.


Next Story