- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
27న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం.. గవర్నర్ నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయిస్తాం..
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ సమావేశాన్ని గవర్నర్ రద్దు చేయడంతో సీఎం భగవంత్ మాన్ గురువారం కీలక ప్రకటన చేశారు. వచ్చే మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. తాజాగా జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 'గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీని ఈ నెల 27(మంగళవారం) నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం' అని పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో విద్యుత్, పంట వ్యర్థాల కాల్చివేత సమస్యలపై చర్చించినట్లు వెల్లడించారు. గురువారం జరగాల్సిన ప్రత్యేక సమావేశాన్ని గవర్నర్ రద్దు చేయడంపై సుప్రీంకోర్టును కోరుతామని తెలిపారు. కాగా, బుధవారం పంజాబ్ గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ అకస్మాత్తుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని ఆప్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి అంతమొందించాలని చూస్తున్నారని కేజ్రీవాల్ వమర్శించారు.