కాంగ్రెస్ లో కలవరం.. మరోసారి సోనియాకు కరోనా

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ లో కలవరం.. మరోసారి సోనియాకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని శనివారం పార్టీ ఎంపీ జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సోనియా అంతకు ముందు జూన్ మొదటి వారంలో కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే వ్యాధి నయం అయినా.. పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. ఈ క్రమంలో జూన్ 12న ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. కరోనా కారణంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరుకాలేకపోయారు. ఆ తర్వాత వ్యాధి నయం అయ్యాక ఈడీ ముందుకు వెళ్లారు. తాజాగా నెల గడవకముందే మరోసారి కరోనా పాజిట్ రావడం కలకలం రేపుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ సైతం నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. ప్రియాంకా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. సోనియా, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ ఖేరా, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మల్లికార్జున ఖర్గే కూడా కరోనా బారిన పడ్డారు. పార్టీలోని నేతలు వరుసగా వైరస్ బారిన పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం ఏర్పడింది.



Next Story