హిమాచ‌ప్రదేశ్‌లో క్లౌడ్ బరెస్ట్.. వరదల్లో చిక్కుకున్న 200 మంది

by Disha Web Desk 12 |
హిమాచ‌ప్రదేశ్‌లో క్లౌడ్ బరెస్ట్.. వరదల్లో చిక్కుకున్న 200 మంది
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో వర్షాలు భీకరంగా కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు సంబంవించి పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా జనాలు వరదల్లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. మండి మొత్తం కొండల ప్రాంతం కావడంతో మేఘాలు విస్ఫోటన చెంది.. వరదలు సబవించాయి. దీంతో ఓ వంతేన గుండా సాగించాల్సిన ప్రయాణాలకు అంతరాయం కలిగింది. అలాగే వరద ఉధృతి అధికంగా ఉండటంతో ఆ రోడ్డు మూసివేయబడింది. దీంతో విద్యార్థులతో వెళ్తున్న బస్సు, అనేక వాహనాలు అక్కడే చిక్కుకుపోయాయని పోలీసులు తెలిపారు. కాగా భారీ వర్షం కారణంగా క్షణాల్లో వరద పెరిగిపోయిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story