చుట్టూ అమ్మాయిలు ఉన్నారని ఎగ్జామ్ హాల్ లో మూర్చపోయిండు

by Dishafeatures2 |
చుట్టూ అమ్మాయిలు ఉన్నారని ఎగ్జామ్ హాల్ లో మూర్చపోయిండు
X

దిశ, వెబ్ డెస్క్: ఎగ్జామ్ హాల్ లో తన చుట్టూ అమ్మాయిలు ఉన్నారనే భయంతో ఓ యువకుడు పరీక్ష హాల్ లో మూర్చపోయాడు. సిబ్బంది వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ ఘటన బీహార్ లో నిజంగానే జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ షరీఫ్ అల్లమా ఇక్బాల్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్న మనీష్ అనే యువకుడికి స్థానికంగా ఉన్న బ్రిలియంట్ స్కూల్ లో ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ పడింది. ఎంతో ఉత్సాహంతో పరీక్ష రాయడానికి ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లిన ఆ యువకుడు.. తన రూమ్ లో అందరూ అమ్మాయిలు ఉండటం చూసి టెన్షన్ కు గురయ్యాడు. ఆ ఎగ్జామ్ హాల్ లో ఉన్న మొత్తం 51 మందిలో 50 మంది విద్యార్థినులు ఉండగా.. అబ్బాయిల్లో ఈ యువకుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. దీంతో తీవ్ర టెన్షన్, భయానికి గురైన ఆ యువకుడు తను కూర్చున్నచోటనే స్పృహతప్పి కిందపడిపోయాడు. అయితే వెంటనే స్పందించిన సిబ్బంది అతడిని సమీపంలోని సదార్ ఆసుపత్రికి తరలించి తల్లితండ్రులకు సమాచారం అందించారు. చిన్నప్పటి నుంచి అమ్మాయిలను చూస్తే సదరు యువకుడు భయపడిపోతాడని అతడి బంధువొకరు చెప్పారు. ఈ సంఘటనతో మనీష్ కు జ్వరం వచ్చిందని ఆమె తెలిపారు.


Next Story