- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బడ్జెట్తో పేదలపై నిశ్శబ్ద దాడి.. కేంద్రంపై సోనియా గాంధీ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ పేదవారిపై మోడీ ప్రభుత్వం చేసిన నిశ్శబ్ద దాడి అని అన్నారు. జాతీయ మీడియాకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిలో అదానీ గ్రూప్పై ఆరోపణలను కూడా ప్రస్తావించారు. ఓవైపు నరేంద్ర మోడీ విశ్వ గురు, అమృత కాల్ అంటూ నినాదాలు చేస్తుంటే.. మరోవైపు ఆయన స్నేహితుడి ఆర్థిక కుంభకోణాల వ్యవహారం బయటకు వచ్చిందని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి విధానాలు కేవలం తన ధనిక స్నేహితులకు ప్రయోజనం చేకూరుస్తూ.. పేద, మధ్య తరగతి భారతీయులను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, సాగు చట్టాలు ఈ కోవలోకే వస్తాయని చెప్పారు. ప్రభుత్వ బలగాలు ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి ప్రభుత్వ సంస్థలను స్నేహితుల యాజమాన్యంలోని పేలవంగా నిర్వహించబడుతున్న కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంతో కోట్లాది మంది పేద, మధ్యతరగతి భారతీయులు పొదుపు డబ్బులకు ముప్పు పొంచి ఉంది' అని సోనియా స్పష్టంగా ప్రస్తావించారు.
ఇటీవల ముగిసిన భారత్ జోడో యాత్రలో యాత్రికులు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నడిచారని తెలిపారు. అన్ని వర్గాలకు చెందిన భారతీయులతో సంభాషించడమే కాకుండా వారి తీవ్ర ఆర్థిక బాధను, నిరాశను తెలుసుకున్నారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర వాగ్దానం ప్రతి భారతీయునికి మంచి జీవితాన్ని ఇస్తుందని, వారి ప్రాథమిక అవసరాలను తీర్చడమే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తమను తాము బలపరిచేందుకు సమాన అవకాశాలు ఉన్నాయని సోనియా తెలిపారు. ఒకే భావజాలం కలిగిన వారు ప్రజలు చూడాలనుకునే మార్పుల దిశగా దేశాన్ని నిర్మించేందుకు చేతులు కలపాలని అన్నారు.