కర్ణాటకాలో 'భారత్ జోడో'.. లండన్‌లో 'భారత్ తోడో' రాహుల్ గాంధీ సిద్దాంతం ఇదే: సీఎం

by Disha Web Desk 12 |
కర్ణాటకాలో భారత్ జోడో.. లండన్‌లో భారత్ తోడో రాహుల్ గాంధీ సిద్దాంతం ఇదే: సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మరోసారి రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 'భారత్ జోడో' కోసం కర్ణాటకకు వచ్చారని, లండన్‌లో 'భారత్ తోడో' గురించి మాట్లాడారని విమర్శించారు.రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత పార్లమెంటును దుర్వినియోగం చేస్తే, ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్లినా తన మాతృభూమిని పొగుడుతారని అన్నారు. అలాగే.. రాహుల్ గాంధీ ఈ ద్వంద సిద్ధాంతం ఇదేనని.. దేశాన్ని విచ్చిన్నం చేయడమే వారి లక్ష్యమని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ రాహుల్ గాంధీని విమర్శించారు.

Next Story

Most Viewed