- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
అమిత్ మాల్వియాపై చేసిన పోస్టుని వక్రీకరించారు- శాంతను సిన్హా
![అమిత్ మాల్వియాపై చేసిన పోస్టుని వక్రీకరించారు- శాంతను సిన్హా అమిత్ మాల్వియాపై చేసిన పోస్టుని వక్రీకరించారు- శాంతను సిన్హా](https://www.dishadaily.com/h-upload/2024/06/11/342092-amit-malvia.webp)
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై తాను చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ సభ్యుడు, అడ్వొకేట్ శాంతను సిన్హా వివరణ ఇచ్చారు. తన పోస్టును వక్రీకరించారని, తప్పుగా అర్థం చేసుకున్నారని శాంతను సిన్హా స్పష్టం చేశారు. మాల్వియాపై తాను లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదని అన్నారు. సోషల్ మీడియాలో తాను బెంగాలీలో పోస్టు చేశానని.. అందులో మాల్వియాపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు. మాల్వియా ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశం లేదని తెలిపారు. విజయ్ వర్గీయ, ప్రదీప్ జోషీ వంటివారు హనీ ట్రాప్లో చిక్కుకున్నారని.. జాగ్రత్తగా ఉండాలని మాత్రమే మాల్వియాకు సూచించానని అన్నారు. తాను పార్టీ కార్యకర్తనని, రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిచానని గుర్తుచేశారు. సొంత పార్టీని, నేతలను తాను ఎందుకు అవమానిస్తానని ప్రశ్నించారు.
అత్యంత అవినీతి పార్టీ
తాను చేసిన పోస్టును దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ వక్రీకరించిందని ఆరోపించారు. బెంగాలీ పోస్ట్ను కొందరు అర్థం చేసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, తాను చేసిన పోస్టుపై వివరణ ఇచ్చానని అన్నారు. ఈ కేసులో అమిత్ మాల్వియా తనపై ఫిర్యాదు చేసినా చట్టబద్ధంగా ఎదుర్కొంటానని తెలిపారు. కాగా.. మాల్వియా బెంగాల్ బీజేపీ కార్యాలయాల్లోనే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శాంతను సిన్హా ఆరోపించారని కాంగ్రెస్ నేత శ్రీనాథ్ శ్రీనాథే సంచలన ఆరోపణలు చేశారు. సుప్రియా చేసిన ఆరోపణలతో కాషాయ పార్టీలో కలకలం రేపాయి.