- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
3 రాష్ట్రాల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్కు భారీ షాక్
![3 రాష్ట్రాల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్కు భారీ షాక్ 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్కు భారీ షాక్](https://www.dishadaily.com/h-upload/2023/12/03/286622-bjp.webp)
దిశ, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని చూస్తుంటే.. మధ్యప్రదేశ్లో బీజేపీ మరోమారు ఆధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రాజస్థాన్లో కాంగ్రెస్కు షాక్తగిలింది. అటు ఛత్తీస్గఢ్లో కాస్త పోటీ-పోటీ కనిపిస్తున్నా.. బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.
మధ్యప్రదేశ్లో..
మధ్యప్రదేశ్లో మొత్తం 230 సీట్లు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 116 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ 161 సీట్లల్లో లీడ్లో దూసుకెళుతోంది. కాంగ్రెస్ కేవలం 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రాజస్థాన్లో..
రాజస్థాన్లో బీజేపీ దూసుకెళుతోంది. 200 సీట్లకు 199చోట్ల ఎన్నికలు జరగ్గా.. ట్రెండ్స్ప్రకారం.. కమలదళం 110 చోట్ల ఆధిక్యంలో దూసుకెళుతోంది. కాంగ్రెస్73 చోట్ల మాత్రమే లీడ్లో ఉంది. రాజస్థాన్లో దశాబ్దాలుగా ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కూడా ఇదే రిపీట్అవుతున్నట్టు కనిపిస్తోంది.
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు షాక్..
ఛత్తీస్గఢ్లో కాస్త హోరాహోరీ పోరు కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్కు గట్టి షాక్ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 90 సీట్లల్లో 46 స్థానాల మెజారిటీ కావాల్సి ఉండగా.. బీజేపీ ఇప్పటికే 54 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 34 సీట్లల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణలో మాత్రం.. కాంగ్రెస్పార్టీ విజయంవైపు దూసుకెళుతోంది. ఇక మిజోరంలో కూడా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ దీనిని సోమవారానికి వాయిదా వేశారు.