- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముగిసిన రిసెప్షనిస్టు అంకిత బండారి అంత్యక్రియలు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్లో సంచలనంగా మారిన 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకిత బండారి హత్య కేసులో ఆదివారం కూడా నిరసనలు హోరెత్తాయి. వివాదస్పదంగా మారిన రిసార్టు వ్యవహారంలో ఎలాంటి తనిఖీలు చేపట్టకుండానే కూల్చివేత చేపట్టడం ఏంటని అంకిత తండ్రి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆదివారం కూడా పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపై చేరి అంకిత మరణానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై ప్రత్యేక విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చేపడుతామని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో గవర్నర్ గుర్మీత్ సింగ్తో సమావేశమై నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని సమాచారమిచ్చారు. తుది పోస్టుమార్టం నివేదికను బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ హామీతో చివరికి అంత్యక్రియలకు అంకిత తండ్రి అంగీకరించారు. ఆదివారం సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. తాను పనిచేసే రిసార్టు యజమాని పులకిత్ ఆర్య చేతిలోనే దారుణ హత్యకు గురైంది.