- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇది మోడీ ప్రభుత్వం.. అక్కడ రాయి విసిరే దమ్ము ఎవరికీ లేదు: అమిత్షా
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రమంత్రి అమిత్షా శనివారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించడం వలన ఇక్కడ రక్తపాతం జరుగుతుందని, గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని వారు అన్నారు. కానీ ప్రధాని మోడీ తీసుకున్న సాహసోపేతమైన చర్యల తర్వాత ఎలాంటి ఆందోళనలు జరగలేదని అన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో రోడ్షో నిర్వహిస్తున్న సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్లో శాంతిభద్రతలు సాధారణంగా ఉన్నాయని, ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వమని, ఈరోజు అక్కడ రాయి విసిరే దమ్ము ఎవరికీ లేదని ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 2019లో జమ్మూకశ్మీర్కు ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పని పట్ల ప్రధాని మోడీ అంకితభావంతో ఉన్నారని, ఆయన గత 23 ఏళ్లుగా ఎలాంటి సెలవులు లేకుండా దేశం కోసం పనిచేస్తున్నారని, కానీ రాహుల్ గాంధీ ప్రతి మూడు నెలలకోసారి విదేశాలకు విహారయాత్రకు వెళతారని అమిత్షా అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఈ సార్వత్రిక ఎన్నికలు ప్రధాని మోడీకి మూడోసారి అధికారం ఇస్తాయని తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పులను 10 ఏళ్లలో సరిదిద్దామని షా పేర్కొన్నారు. గాంధీనగర్ లోక్సభ స్థానానికి శుక్రవారం ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.