కదులుతున్న ట్రైన్ నుంచి ఊడిన బోగీలు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు

by Dishafeatures2 |
కదులుతున్న ట్రైన్ నుంచి ఊడిన బోగీలు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు
X

దిశ, వెబ్ డెస్క్: కదులుతున్న ఓ ట్రైన్ నుంచి ఒక్కసారిగా బోగీలు విడిపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే కొద్దిదూరం వెళ్లాక బోగీలు వాటంతటా అవే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బీహార్ లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని రాక్సౌల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సత్యాగ్రహ ఎక్స్ ప్రెస్ ట్రైన్.. బీహార్ బెట్టియా జిల్లాలోని మజ్ హాలీయా స్టేషన్ సమీపంలోకి రాగానే ట్రైన్ కు సంబంధించిన 5 బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో అరుపులు పెట్టారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఇంజిన్ చాలా కిలో మీటర్ల దూరం వెళ్లిపోయింది.

ఇక విడిపోయిన బోగీలు కొంత దూరం వెళ్లాక వాటంతటా అవే ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికి చిన్న గాయాలు కూడా కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రెండు బోగీలను కలిపే కప్లింగ్ సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ఘటనుకు సంబంధించి విచారణకు ఆదేశించినట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.


Next Story