- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
2024 ఎన్నికలు ప్రధాని మోడీ Vs రాహుల్: అజిత్ పవార్
దిశ, నేషనల్ బ్యూరో: 2024 లోక్సభ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరుగుతున్న పోరు అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. శనివారం పూణే జిల్లాలోని బారామతి లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అజిత్ పవార్ భార్య సునేత్ర, అక్కడి హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేసి అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన అజిత్, హనుమంతుడిని ప్రార్థించిన తర్వాతే అధికారిక ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ ఎన్నికలు రాహుల్ Vs మోడీ పోరు అని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమానికి అజిత్ పవార్, ఆయన కుమారులు పార్థ్, జే, పలువురు స్థానిక పార్టీ నేతలు హాజరయ్యారు.
అయితే అదే లోక్సభ స్థానం నుంచి విపక్ష మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) కూటమి తరపున నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్) పార్టీ అభ్యర్థిగా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో ఇదే ఆలయంలో పూజలు చేసి శుక్రవారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శివసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన మహాయుతి కూటమిలో ఎన్సీపీ ఒక భాగం. ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యుబీటీ), కాంగ్రెస్తో కూడిన మహా వికాస్ అఘాడిలో భాగం.