నా తల్లి వ్యాక్సిన్ తీసుకుంది.. ఆనందంతో మోదీ ట్వీట్

by  |
నా తల్లి వ్యాక్సిన్ తీసుకుంది.. ఆనందంతో మోదీ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించారు.

‘ఈ రోజు నా తల్లి COVID-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత ఉన్న మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేసి, వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను’ అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Next Story

Most Viewed