‘పాదయాత్రలో ముద్దులు ఇప్పుడు గుద్దులు’

by  |
‘పాదయాత్రలో ముద్దులు ఇప్పుడు గుద్దులు’
X

దిశ ఏపీ బ్యూరో: పాదయాత్రలో ముద్దులు కురిపించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గుద్దులు కురిపిస్తున్నారంటూ ట్విట్టర్ మాధ్యమంగా ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ హయాంలో భూములు ఇవ్వగా, పేదలు అందులో గుడిసెలు వేసుకున్నారని, ఇప్పుడా గుడిసెలను కూల్చివేయడం జగన్ అహంకార ధోరణికి నిదర్శనం అని పేర్కొన్నారు. పాదయాత్రలో ముద్దులు, ఇప్పుడు గుద్దులు అంటూ విమర్శించారు. పేదల భూములు లాక్కుని పేదలకే అమ్మడం జగన్ మార్కు రివర్స్ టెండర్ అంటూ ఎద్దేవా చేశారు. “మీకు ఉండడానికి విల్లాలు, రాజప్రాసాదాలు కావాలి. పేదవాడికి గుడిసె వేసుకునే హక్కు కూడా లేదా?” అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story