రివర్స్ టెండరింగ్‌కు పరాకాష్ఠ జగన్: లోకేష్

by  |

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్‌కు పరాకాష్ఠ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై ట్విట్టర్ మాధ్యమంగా లోకేశ్ స్పందిస్తూ… పేదలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను తిరిగి తీసుకుని, మళ్లీ పేదలకు పంచుతామనడం ఆయన రివర్స్ టెండరింగ్‌కు పరాకాష్ఠ అని విమర్శించారు. పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. వారి భూములు స్వాధీనం చేసుకునే బదులు వేల ఎకరాల్లో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్లు, ప్యాలెస్‌లు పేదల ఇళ్ల కోసం ఇవ్వండి అని ట్వీట్ చేశారు.


Next Story