- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: అధికార మదం కళ్లకెక్కిన వైసీపీ పాలకులకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందనీ టీడీపీ నేత నారాలోకేశ్ ట్వీట్టర్ లో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన మర్రిమేకుల పల్లిలో ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే జేసీబీతో ఇండ్లు పడగొట్టిన రాక్షసత్వం వైసీపీ వాళ్లదని ఆయన అన్నారు. ఘటనలో గాయపడిని చిన్నారి చావు బతుకుల్లో ఉందని ఆయన తెలిపారు. పరిహారం చెల్లించకుండా ఇండ్లను కూల్చివేయడం దారుణమైతే మనుషులు ఉండగానే ఇండ్లను కూల్చడాన్ని ఏమనాలని ఆయన అన్నారు. బతికుండగానే మనుషులను సమాధి చేయాలన్న క్రూరమైన ఆలోచనలు వైసీపీకి ఎలా వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏ మాత్రం మానవత్వం ఉన్నా కూల్చివేతలను ఆపివేయాలని ట్విట్టర్ లో ఆయన కోరారు.
ఘటనలో గాయపడ్డ మూడేళ్ళ చిన్నారి చావుబతుకుల్లో ఉన్నాడు. పరిహారం చెల్లించకుండానే ఇళ్లను కూల్చివేయడం దారుణమైతే…మనుషులు ఉండగానే ఇళ్ళను కూల్చడాన్ని ఏమనాలి? బతికుండగానే మనుషుల్ని సమాధి చేయాలన్న క్రూరమైన ఆలోచనలు మీకెలా వస్తున్నాయి? ఏ మాత్రం మానవత్వం ఉన్నా కూల్చివేతలని తక్షణం ఆపండి(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 30, 2020