ఒకేసారి 18 మంది సర్పంచ్‌లకు నోటీసులు

by  |
ఒకేసారి 18 మంది సర్పంచ్‌లకు నోటీసులు
X

దిశ, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వివిధ గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు నోటీసులు జారీ అయ్యాయి. జిల్లాలో 18 మంది సర్పంచులకు కలెక్టర్ యాస్మిన్ బాషా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తుర్కదిన్నే, ఎర్రన్నబావితండా, తీగలపల్లి, నాగులపల్లితండా, విన్నచెర్ల, చంద్రకల్, నారాయణపల్లి, జొన్నలబోగుడ, పర్వతపూర్, తుమ్మలసుగూరు, చౌదర్‌పల్లి, రాంపూర్, మర్రికుంట తండా, సింగవరం, కుడికిల్ల, ఉప్పునూంతల, వెల్టూరు, అయ్యవారిపల్లి గ్రామాల సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.


Next Story

Most Viewed