వర్షాన్ని లెక్క చేయకుండా.. కలెక్టర్ సుడిగాలి పర్యటనలు

by  |
వర్షాన్ని లెక్క చేయకుండా.. కలెక్టర్ సుడిగాలి పర్యటనలు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: విరామం లేకుండా వర్షం కురుస్తున్నా… ఏకంగా 20 మండలాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటనలు చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ గురువారం ఉదయం 5 గంటల నుంచి పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేర్, పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, తాడూర్, కల్వకుర్తి, ఉర్కొండ, వెల్దండ, వంగూర్, అచంపేట, మన్ననూరు, వంకేశ్వరం, పధర, లింగాల తదితర మండలాలను సందర్శించారు.

ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కవైపు వర్షం పడుతున్నా.. ఆయన మాత్రం తన పర్యటన కొనసాగించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన అక్కడ ప్రజలతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించిన పనుల పురోగతి గురించి వాకాబూ చేశారు. పనుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అధికారులను, సర్పంచ్‌లను హెచ్చరించారు.


Next Story

Most Viewed