ప్రతీ రైతు అకౌంట్లో డబ్బులు జమ చేస్తాం.. బ్యాంకు ఛైర్మన్ క్లారిటీ

by Sridhar Babu |
ప్రతీ రైతు అకౌంట్లో డబ్బులు జమ చేస్తాం.. బ్యాంకు ఛైర్మన్ క్లారిటీ
X

దిశ, కల్లూరు(తల్లాడ): గతంలో తల్లాడ సహకార సొసైటీ ద్వారా రైతుల ఖాతాల్లో నుండి మాయమైన నగదును తిరిగి ప్రతి ఒక్క రైతుకు వారి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందని ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కూరాకుల నాగభూషణం పేర్కొన్నారు. ఆదివారం తల్లాడ సహకార సొసైటీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. సొసైటీ చైర్మన్ రెడ్డం వీరమోహన్ రెడ్డిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూరాకుల మాట్లాడుతూ.. తల్లాడలో సహకార సొసైటీ నూతన గోదాంకు రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.50 లక్షలతో నిర్మించిన సొసైటీ కార్యాలయం అద్భుతంగా ఉందన్నారు.

రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, వారి అకౌంట్లలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్ లాల్, సొసైటీ డైరెక్టర్లు గుంటుపల్లి వెంకటయ్య, దగ్గుల రాజశేఖర్ రెడ్డి, గోవిందు శ్రీనివాసరావు, టీఆర్ఎస్ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు, తల్లాడ పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు (జి వి ఆర్), సరికొండ కస్తూరిరాజు, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed