ఆదివాసీ ఐక్యత కోసం.. ఇంటికో ఆకుపచ్చ జెండా: మోకాళ్ల కన్నయ్య

by Sridhar Babu |   ( Updated:2021-08-05 07:12:01.0  )
tribal 1
X

దిశ, గుండాల : గుండాల మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని తుడుం దెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం తుడుం దెబ్బ గుండాల మండల అధ్యక్షుడు మోకాళ్ల కన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తుడుం దెబ్బ జిల్లా నాయకులు వజ్జ ఎర్రయ్య, పూనెం శ్రీను, సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు వీసీ దొర మాట్లాడుతూ.. ఆగస్ట్ 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయుటకు ప్రతి ఆదివాసీ ఇంటికొక్కరు ఆకు పచ్చ జెండా పట్టుకొని రావాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీ హక్కుల కోసం, ఆదివాసీ చట్టాల అమలు కోసం, ఆదివాసీ అస్తిత్వం కోసం, ఆదివాసీ ఐక్యత కోసం ఆగస్ట్ 9న చీమల దండులా కదిలి రావాలని, ఆదివాసీ హక్కులను ఎలుగెత్తి చాటాలని అన్నారు. గుండాల మండలంలోని రాజకీయ పార్టీలకు అతీతంగా ఆదివాసీ మహిళలు, రైతులు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆగస్ట్ 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి గోవిందా నరసింహారావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పూనెం రమణ బాబు, ఆదివాసీ యువకులు మోకాళ్ళ మహేందర్, చింత వెంకట్, కిషన్ రావు, రమేష్ కిషోర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story