- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నల్లగొండ : పెండ్లి ఇంట్లో మటన్ సరిగా పెట్టలేదనే గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. వివాహం జరుగుతున్న ఇంట్లో రక్తాన్ని చిందించింది. ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్సై మోహన్ తెలిపిన వివరాల ప్రకారం… దాచారం గ్రామానికి చెందిన తాటిపాముల మహేశ్కు జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన యువతితో వివాహం కుదిరింది. పెండ్లి కూతురును తీసుకువచ్చేందుకు పాకాలకు పెండ్లి కొడుకు తరపు బంధువులు వెళ్లారు.
అక్కడ పెండ్లి కూతురు సంబంధికులు మర్యాదలు సరిగా చేయడం లేదని, మాంసం సరిగా పెట్టలేదని… దాచారానికి చెందిన సూరారం వెంకటయ్య అదే గ్రామానికి చెందిన కుల పెద్ద చంద్రయ్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవ బంధువుల చొరవతో సద్దు మణిగింది. దాచారం చేరుకున్న తర్వాత సూరారం వెంకటయ్య మళ్లీ ఆ విషయాన్ని లేవనెత్తడంతో వివాదం తలెత్తింది.
ఈ క్రమంలో వెంకటయ్య కుమారుడు ప్రవీణ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. చంద్రయ్య కుమారులు పరశురాములు, నాగరాజులపై ప్రవీణ్ గొడ్డలితో దాడి చేశాడు. ఇరు వర్గాల వారు పరస్పరం కర్ర, గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో సూరారం పరుశరాములుకు మెడకు, చెవికి గాయాలయ్యాయి. సూరారం నాగరాజుకు ఎడమ చేతిపై గాయం అయింది. ఇద్దరిని భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పరశురాములు మృతి చెందాడు. నాగరాజును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.