వారిని ఇబ్బంది పెట్టకండి.. TS సర్కార్‌కు ఉత్తమ్ హెచ్చరిక

by  |
వారిని ఇబ్బంది పెట్టకండి.. TS సర్కార్‌కు ఉత్తమ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్‌పై మాజీ టీపీసీసీ అధ్యక్షులు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. ఖరీఫ్ పంట కొనుగోలుపై ప్రభుత్వానికి ఇంతవరకూ సరైన ప్రణాళిక లేదని ఎద్దేవా చేశారు. రబీ పంటలో వరిపై ఆంక్షలు పెట్టొద్దని సూచించారు. రైతులకు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల విషయంలో గిరిజనులను ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. ప్రభుత్వ తీరు మారకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగేవరకూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని నిర్ణయించుకున్నారు.


Next Story

Most Viewed