- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో చాలా సమస్యలు ఉన్న అందకూర్ గ్రామ రూపురేఖలు మార్చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. గురువారం అందకూర్ గ్రామంలో ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన స్కిమ్ లో భాగంగా సభ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటిని గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం దత్తత గ్రామాలకు స్పెషల్ నిధులు విడుదల చేయనుందని, ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఏ ఒక్క సమస్య లేకుండా అన్ని వసతులు, సదుపాయాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. రూర్భన్ పథకం ద్వారా కుంటాల మండలానికి 15 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, ప్రధానమంత్రి 22 పథకాల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిచేందుకు కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుకి మాట్లాడుతూ… గ్రామంలో ఏ సమస్య ఉన్న సెక్రెటరీ, సర్పంచ్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి, జిల్లా బీజేపీ శ్రేణులు, సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.