ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు….

by  |
ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు….
X

దిశ, వెబ్ డెస్క్:
పదిమందికి అన్నం పెట్టే అమరావతి రైతులు తల వంచాల్సిన అవసరం లేదనీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. రైతులకు సంకెళ్ల విషయంలో యావత్ తెలుగు ప్రజానీకం సిగ్గుపడాలని ఆయన అన్నారు. ఆటో పెయిడ్ ఆర్టిస్టులను ప్రశ్నించిన వారిపై ఎస్పీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆయన అన్నారు. ఘటనపై తమ పార్టీ తరఫున క్షమాపణ చెబుతున్నానని ఆయన తెలిపారు. రైతు భరోసా పథకం సహాయంలో కేంద్రం వాటా కూడా ఉందని అన్నారు. పథకంలో ప్రధాని పేరు కూడా ఉంటే బాగుండేదని ఆయన చెప్పారు. ఎన్నికల సంఘం నిర్ణయాలకు విరుద్దంగా ప్రవర్తించడం తగదని ఆయన అన్నారు. కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపే పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన అన్నారు.

Next Story

Most Viewed