BREAKING: డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరు

by Disha Web Desk 19 |
BREAKING: డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి రాడిసన్​ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో గచ్చిబౌలి పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. రాడిసన్​ బ్లూ హోటల్‌లో పార్టీ జరిగేటప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన వివేకానందతో క్రిష్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితుల జాబితాలో క్రిష్ పేరును చేర్చారు. ఎఫ్ఐఆర్‌లో ఉన్న నిందితులందరిని పిలిచి విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో మరికొందరు సెలబ్రెటీలు సైతం పాల్గొన్నట్లు సమాచారం. కాగా, బీజేపీ నేత యోగానంద్​కుమారుడు వివేకానంద్‌ రాడిసన్ హోటల్‌లో ఫ్రెండ్స్‌కు డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ చేసిన పోలీసులు వివేకానంద్‌‌తో పాటు అతని ఇద్దరు మిత్రులు, ఓ పెడ్లర్‌ను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడిని పోలీసులు నిందితుడిగా చేర్చారు.

కాగా, డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై డైరెక్టర్ క్రిష్ స్పందించారు. తన ఫ్రెండ్స్ పిలవడం వల్లే పార్టీకి వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. తన డ్రైవర్ రాగానే అక్కడి నుండి వెళ్లిపోయానని తెలిపారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని వివరణ ఇచ్చారు.

Next Story

Most Viewed