- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సినీ నటి సాయి పల్లవికి హైకోర్టులో చుక్కెదురు
దిశ, తెలంగాణ బ్యూరో : కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై సినీ నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యల దుమారం మరో కీలక మలుపు తిరిగింది. సాయి పల్లవి వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ నాయకులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని, కేసు నమోదు చేసిన పోలీసులు.. గత నెల 21న సాయి పల్లవికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను రద్దు చేయాలని సినీ నటి సాయి పల్లవి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గురువారం విచారించిన హైకోర్టు.. సాయి పల్లవి వేసిన పిటిషన్ ను కొట్టి వేస్తూ అభ్యర్థనను తోసి పుచ్చింది. 'విరాటపర్వం' సినిమా ప్రచారంలో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో 'కశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ గురించి విన్నానని, తాను మాత్రం న్యూట్రల్ గా ఉంటానని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడారు. 90లో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చిత్రంలో చూపించారని, కొవిడ్ సమయంలో ఓ ప్రాంతంలో గోవును వాహనంలో తరలిస్తుండగా దాని డ్రైవర్ ఓ ముస్లిం అని, కొంతమంది డ్రైవర్ ను కొట్టి జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారని, అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగినదానికి తేడా ఏముందంటూ సాయి పల్లవి వ్యాఖ్యానించారు. మంచిగా ఉండాలి.. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై భజరంగ్ ధళ్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులపై సాయిపల్లవి హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.