- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
షూటింగ్లో పళ్లు.. కాలు విరగొట్టుకుని ఆసుపత్రి పాలైన హీరోయిన్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘రాజకుమారుడు’ సినిమాలో హీరోయిన్గా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్లో మొదటి మూవీకే భారీ క్రేజ్ రావడంతో పాటు వెంకటేష్ సరసన చాన్స్ కూడా దక్కించుకుంది. ప్రేమంటే ఇదేరా చిత్రంలో కనిపించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. కానీ ఆ తర్వాత ప్రీతి జింటాకు టాలీవుడ్లో ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్కు చెక్కేసింది. అక్కడే వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పీక్స్లో ఉండగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.
ప్రస్తుతం ఆమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ప్రీతి జింటా ఓ ఆసక్తికర పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. ఓ నెటిజన్ ‘సంఘర్ష’ సినిమాలో జరిగిన సంఘటన గురించి ప్రశ్నించగా.. దానికి ప్రీతి జింటా స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ట్విట్టర్లో లైవ్ చాట్ సెషన్లో భాగంగా.. ‘‘ఆ షూట్లో నేను నా కాలు విరగ్గొట్టుకున్నాను.
దంతాలు ఊడిపోయాయి. నా పెదవి కూడా కోసుకోవడంతో కష్టంగా షూటింగ్ కంప్లీట్ చేశాను. ఇది జరిగిన తర్వాత నేను చాలా ఆస్పత్రులు తిరిగి వారి చెప్పింది విని భయపడిపోయాను. చివరికి ఓ హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స తీసుకుని కోలుకున్నాను. అశుతోష్ ఈ చిత్రంలో ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ చేశాడు’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ప్రీతి జింటా పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.