ఆ సినిమా వల్ల ఇండియా షేక్ అయిపోయింది.. నా కళ్ల ముందు కనిపిస్తోంది.. రాజ్ తరుణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Disha Web Desk 6 |
ఆ సినిమా వల్ల ఇండియా షేక్ అయిపోయింది.. నా కళ్ల ముందు కనిపిస్తోంది.. రాజ్ తరుణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: 2006లో విడుదలైన పోకిరి ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ హీరోయిన్ ఇలియానా జంటగా నటించారు. దీనిని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించగా.. ఈ సినిమా థియోటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయి 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఇందులోని ఓ డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుని పలు పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పోకిరి మూవీపై వరుస పోస్టులు పెట్టాడు. ‘‘ఇది గోపాలపట్నంలోని శంకర థియేటర్‌లో చూసినట్లు ఇప్పటికీ గుర్తుంది. కృష్ణ మనోహర్ IPS సన్నివేశానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఇప్పటికీ నా కళ్ల ముందు నిలిచిపోయింది. దిమ్మ తిరిగి బాక్స్ ఆఫీస్ కి బ్లాక్ అయిపోయింది. ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. మన సూపర్‌స్టార్ బుల్లెట్-ఫైరింగ్ ప్రదర్శనను వీధులు ఎప్పటికీ మరచిపోలేవు. మహేష్ బాబు సినిమా భారతీయ చరిత్రలో నిలిచిపోయింది!’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed