- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చెంప దెబ్బలు తట్టుకోలేక నటనకు స్వస్తి చెప్పాలనుకున్నా: Shakti Kapoor
దిశ, సినిమా : ప్రముఖ హాస్యనటులు శక్తి కపూర్ కెరీర్లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించాడు. తాజాగా 'ది కపిల్ శర్మ షో'లో భాగంగా హోస్ట్ కపిల్ 'లెజెండరీ కమెడియన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా' అనే పేరుతో ఓ ప్రత్యేక ఎపిసోడ్ని నిర్వహించగా.. శక్తి కపూర్, అస్రానీ, పెంటల్, టికు తల్సానియా అతిథులుగా హాజకయ్యారు. ఈ సందర్భంగా శక్తి కపూర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'ఒక దశలో బాలీవుడ్ వదిలేద్దామనుకున్నా. నా మొదటి కామెడీ చిత్రం 'సత్తె పే సత్తా' గ్రూఫీ పెంటల్తో కలిసి చేశాను. అందులో నటించాలని రాజ్ సిప్పీ నన్ను సంప్రదించినప్పుడు నా విలన్ పాత్రలకు ప్రశంసలు లభిస్తున్నట్లు అనిపించింది. అందుకు తగ్గట్లే ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత 'మావాలి' సినిమా చేశాను. ఇందులో మొదటి షాట్ తీస్తున్నప్పుడు ఖాదర్ఖాన్ నా చెంప మీద కొట్టాడు. దాంతో నేలపై పడ్డాను. రెండో షాట్లో అరుణా ఇరానీ చెంప మీద కొట్టింది. మళ్లీ నేలపై పడ్డాను. మూడోసారి కూడా అదే జరిగింది. దాంతో నా కెరీర్ ముగిసిపోయిందని ఆందోళన చెందాను. వెంటనే ఖాదర్ ఖాన్ వద్దకు వెళ్లి.. 'మీకు దండం పెడతా.. నాకు సాయంత్రం టికెట్ బుక్ చేయండి. నేను వెళ్లిపోతా. ఈ చిత్రం చేయలేను. నా కెరీర్ కూడా ముగిసిపోయింది. నాకు ఇక పెళ్లి కూడా కాదు' అని వేడుకున్నట్లు తెలిపాడు. అయితే ఇదంతా గమనించిన యాక్షన్ డైరెక్టర్ తన దగ్గరకి వచ్చి 'ఈ చెంప దెబ్బ నీకు కీర్తిని తెచ్చిపెడుతుంది. కాబట్టి కంటిన్యూ చెయ్' అని సలహా ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు.